

భారత యువ క్రికెటర్లు ఇటీవల ఆటతో పాటు మైదానంలో దూకుడైన వైఖరితోనూ వార్తల్లో నిలుస్తున్నారు. భారత్ A తరఫున ఆడుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగడం, ప్రస్తుతం టెస్టు సిరీస్లో యశస్వి జైస్వాల్ ప్రత్యర్థి ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. ఐసీసీ, బీసీసీఐ ఇలాంటి వ్యవహారాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. శిక్షలు లేకపోతే యువ ఆటగాళ్లు ఇలాంటి ప్రవర్తనను పునరావృతం చేసే అవకాశం ఉందని, ఇది క్రికెట్కు, వారి భవిష్యత్తుకు మంచిది కాదని పేర్కొన్నారు.
గత జూన్లో శ్రీలంక Aతో జరిగిన ట్రై సిరీస్లో భారత్ A తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఔటైన అనంతరం డగౌట్కు వెళ్తున్న సమయంలో శ్రీలంక ఆటగాడు విషేన్ హలంబేజ్తో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రం కాకముందే సహచరులు జోక్యం చేసుకుని ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో ఇరువురు ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు యశస్వి జైస్వాల్ వ్యవహారంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయం మేరకు ఆయన మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఒకే విధమైన కఠిన చర్యలు అవసరమని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!