

ప్రముఖ నటుడు మంచు విష్ణు తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు సంబంధించిన ఓ మధుర జ్ఞాపకాన్ని మళ్లీ సజీవం చేశారు. మోహన్ బాబు తొలిసారిగా కొనుగోలు చేసిన వింటేజ్ ప్రీమియర్ పద్మిని కారును పూర్తిగా పునరుద్ధరించారు. ఎంతో శ్రద్ధతో పాత కారుకు కొత్త రూపు తీసుకొచ్చి, ప్రస్తుతం అది మళ్లీ రోడ్డుపైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న విష్ణు.. ఈ కారు తమ కుటుంబ చరిత్రలో ఒక చిన్న భాగమని, కేవలం ఓ యంత్రం మాత్రమే కాదని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. విష్ణు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి, నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ విడుదలై ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా సినిమా తనకు కేవలం వినోదాన్ని అందించడమే కాకుండా, తనను వ్యక్తిగతంగా మార్చిన ఓ ప్రయాణమని విష్ణు పేర్కొన్నారు. విశ్వాసం, త్యాగం, భక్తి నేపథ్యంలో సాగిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు శివభక్తుడైన తిన్నడి పాత్రలో నటించగా.. అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్ లాల్ కిరాతుడిగా, ప్రభాస్ రుద్రుడిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!