

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్లను అరికట్టేందుకు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. 2024 ప్రజా పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) చట్టంలో కీలక సవరణలు చేసి, పేపర్ లీక్లకు పాల్పడిన వారిపై ప్రస్తుతం ఉన్న శిక్షలు, జరిమానాలను మరింత కఠినతరం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అలాగే, పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూడా ప్రతిపాదనలో ఉంది. ఈ కోర్టుల ద్వారా ఏడాది లోపే కేసుల విచారణ పూర్తిచేసి దోషులకు శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఢిల్లీలో నిరసనలు కొనసాగిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో కేంద్రం మరోసారి చర్చలు జరపనుంది. ప్రభుత్వ హామీలతో ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ, ఆందోళనలు కొనసాగనున్నట్లు సీజేపీ ప్రకటించింది. అయితే, ఈ ప్రతిపాదనలపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!