

ప్రవచన చక్రవర్తి, నైతిక విలువల సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఉండవల్లిలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత కీలకమని ఆయన వివరించారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, మానవీయత, నైతిక విలువలను పెంపొందించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్ డే సందర్భంగా చాగంటి మార్గదర్శకత్వంలో రూపొందించిన నైతిక విలువల పాఠ్యాంశాలను బోధిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సమగ్ర విద్యా వికాసానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని పేర్కొన్న చాగంటి కోటేశ్వరరావును భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ స్వయంగా కారు వరకు వచ్చి సాదరంగా సాగనంపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!