

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిజ్యపరంగా బంగారం ఉత్పత్తి ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో పాటు రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో రూ.405 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. ప్రయోగాత్మక ఉత్పత్తి విజయవంతం కావడంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించారు. దేశంలోనే ప్రైవేట్ రంగంలో బంగారం తవ్వకం, ఉత్పత్తి చేపట్టిన తొలి ప్రాజెక్టుగా ఇది నిలిచింది. ఏటా రెండు టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 700 మందికి ఉపాధి లభించనుండగా, బంగారం ఉత్పత్తి విలువపై 4 శాతం రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. తొలి ఏడాదిలో 400 కిలోల బంగారం ఉత్పత్తితో సుమారు రూ.57 కోట్ల రాయల్టీ వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!