
జనరల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లుండి తిరుమలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో సీఎం పాల్గొని.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం దంపతులు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.
ఈ నెల 16న తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రికల్ బస్సులు, ‘నందనం’ యాప్ను ప్రారంభించడంతో పాటు భక్తుల కోసం ఎల్ఐసీ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ పిలిగ్రీమ్ సెంటర్ను కూడా సీఎం ప్రారంభించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!