

బిగ్బాస్ తెలుగు 10లో తొలి వారంలోనే వరుస ఎలిమినేషన్లతో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మిడ్వీక్ ఎలిమినేషన్ పేరుతో చరణ్, చైత్రలను హౌస్ నుంచి బయటకు పంపించారు. అయితే వీరిద్దరూ తిరిగి బిగ్బాస్ ఇంట్లోకి వస్తారనే ప్రచారం కొనసాగుతోంది. నాగార్జున వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడించి, ఇద్దరూ తమ ఇళ్లలోనే ఉన్నారని స్పష్టం చేశారు. అయినప్పటికీ, వీడియో కాల్లో కనిపించిన నేపథ్యంపై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. మూడో ఎలిమినేషన్కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. శనివారం ఎపిసోడ్లో త్రిగుణ్, షాలినీ, దేబ్జానీ హౌస్మేట్స్గా మారినట్లు నాగార్జున తెలిపారు. ఇక ఆదివారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలో వర్షిణి, సుధీర్, కృష్ణుడు హై రిస్క్ జోన్లో చివరి వరకు ఉన్నట్లు చూపించారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని ప్రోమో సూచిస్తోంది. అయితే ప్రోమోలో చూపించినట్లుగానే ఎలిమినేషన్ ఉండకపోవచ్చని పలువురు భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!