

పాత విశాఖపట్నం ఎయిర్పోర్టులో వాణిజ్య విమానాల సేవలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పిటిషన్ను కొట్టివేసిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. ఈ సమస్యకు సంబంధించిన ప్రధాన కార్యాచరణ అంతా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియా ధర్మాసనం పేర్కొంది.
కొత్త ఎయిర్పోర్ట్ విశాఖ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ వాదించారు. సరైన కనెక్టివిటీ లేకపోవడంతో ప్రజలకు సమస్యలు తలెత్తుతున్నాయని, వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే బాధితులు, ప్రధాన అంశం విశాఖపట్నంలోనే ఉన్నందున సంబంధిత ఏపీ హైకోర్టును ఆశ్రయించడం సముచితమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!