
జనరల్

కర్ణాటకలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వచ్చే నెల 1 నుంచి 29 వరకు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరిక చేశారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే కేవలం ఓటు హక్కే కాకుండా, భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.
ఓటు హక్కు జీవించే హక్కుతో సమానమని పేర్కొన్న ఆయన, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వచ్చే నెల 1 నుంచి 29 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రజలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!