

దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులోని డీఎంకే కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి ముందు కొన్ని కీలక డిమాండ్లను డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముందుంచినట్లు సమాచారం.
రాబోయే 25 సంవత్సరాల పాటు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కల బదులుగా 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగించాలని డీఎంకే కోరుతోంది. అలాగే అన్ని రాష్ట్రాలకు లోక్సభ స్థానాలను ఒకే విధంగా 50 శాతం పెంచాలని, పునర్విభజన తర్వాత ప్రతి రాష్ట్రానికి ఎన్ని సీట్లు వస్తాయో బిల్లులో రాష్ట్రాల వారీగా స్పష్టంగా పేర్కొనాలని డిమాండ్ చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటేనే బిల్లుకు మద్దతు ఇస్తామని డీఎంకే స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!