

పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్య అనేది కేవలం మార్కులు సాధించడానికి మాత్రమే కాకుండా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదపడాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు అనే మూడు ప్రధాన స్తంభాల మధ్య సమన్వయం ఉంటేనే విద్య లక్ష్యం నెరవేరుతుందని పేర్కొంటున్నారు. పిల్లల అభ్యాసం, ప్రవర్తన, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని, కేవలం మార్కులకే ప్రాధాన్యం ఇవ్వకూడదని సూచిస్తున్నారు. పరస్పర నమ్మకం, సంభాషణ, గౌరవం విద్యా వ్యవస్థకు బలమైన పునాదులని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు జీవిత విలువలను కూడా బోధించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదు విలువలు అయిన సహానుభూతి, శ్రమకు గౌరవం, ప్రశ్నించే తత్వం, జట్టుగా నేర్చుకోవడం, రాజ్యాంగ విలువలను చిన్ననాటి నుంచే అలవర్చాలని సూచిస్తున్నారు. పాఠశాలలు కేవలం చదువు చెప్పే కేంద్రాలు కాకుండా మంచి పౌరులను తీర్చిదిద్దే వేదికలుగా మారాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మార్కుల కంటే మంచి మనుషులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!