

ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 51 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. పోలవరం వద్ద గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికంటే గణనీయంగా తగ్గిందని, ఈ పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రైతులు కొత్త బోర్లు తవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలను సంరక్షించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ద్వారా దీర్ఘకాలిక నీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా గత ప్రభుత్వంతో పోలిస్తే పేదలకు అధిక ఆర్థిక సహాయం అందుతోందని పేర్కొంటూ అమ్మఒడి, వాహనమిత్ర, రైతుభరోసా వంటి పథకాలతో పోలికలు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!