
బిజినెస్

పవన్ కళ్యాణ్ ఏరువాక పున్నమి సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే ఈ వ్యవసాయ పండుగ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురిసి రైతుల ఇళ్లలో పంటలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా ఇప్పటికే నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. త్వరలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల్లో రైతులకు మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!