
బిజినెస్

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటన నేపథ్యంలో రెస్క్యూ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపు ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా సహాయక చర్యలు కూడా నెమ్మదించాయి. శిథిలాలను సురక్షితంగా తొలగించేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు జయదర్శి అపార్ట్మెంట్ను కూల్చివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితులను బట్టి ఈరోజే కూల్చివేత చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 40 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాజిద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలతో పాటు ప్రమాదానికి దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!