
సినిమాలు

భద్రాచలం సమీపంలో గోదావరి నది వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నదిలో 38.70 అడుగుల నీటిమట్టం నమోదవగా, 7,50,069 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
రాజమండ్రి, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా వరద ప్రవాహం తగ్గుతోంది. బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 13.50 అడుగులకు చేరినా, భద్రతా చర్యల్లో భాగంగా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!