
జనరల్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జనసమీకరణ, పార్కింగ్, తాగునీరు, ఆహారం, రవాణా, వైద్య సేవలు, భద్రత వంటి అన్ని అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ చారిత్రక వేడుకను విజయవంతం చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!