

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ తన పార్టీ ఎమ్మెల్సీలకు త్రీలైన్ విప్ జారీ చేసింది. మంగళవారం జరిగే సమావేశాలకు ఎమ్మెల్సీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. చర్చల్లో పార్టీ విధానాలకు అనుగుణంగా మాట్లాడాలని, బిల్లులు, తీర్మానాలు, ఓటింగ్ సమయంలో పార్టీ నిర్ణయాన్ని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. విప్ను ధిక్కరిస్తే అనర్హత వేటుకు దారితీసే అవకాశం ఉందని పార్టీ హెచ్చరించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్లు చెబుతున్న వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యల అంశం సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్సీలంతా అందుబాటులో ఉండేలా, కీలక అంశాలపై పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించేలా బీఆర్ఎస్ ఈ విప్ జారీ చేసింది. తాతా మధు వ్యవహారంపై తదుపరి చర్యలు సభా కార్యక్రమాల సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!