
జనరల్

నంద్యాల జిల్లా శ్రీశైలంలో వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మల్లన్న ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో శ్రీశైలం రహదారుల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. టోల్గేట్ నుంచి ఆలయ ముఖద్వారం వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మరోవైపు వరుణయాగం సందర్భంగా నేడు, రేపు ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!