

గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో కూలిన ఏడు అంతస్తుల భవనం ఘటనాస్థలాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, దెబ్బతిన్న జయదర్శిని అపార్ట్మెంట్ను పరిశీలించారు. శిథిలాలను తొలగించి, నిపుణులతో భవన సామర్థ్యాన్ని పరీక్షించే వరకు దెబ్బతిన్న ప్రాంతంలో ఎవరూ ఉండకూడదని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా నిర్మించిన భవనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. అంజయ్యనగర్లో మరో నాలుగు అక్రమ భవనాలను గుర్తించామని, వాటి కూల్చివేత పనులను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. తక్కువ స్థలంలో ఏడు, ఎనిమిది అంతస్తులు నిర్మించి హాస్టళ్లుగా నిర్వహిస్తున్న భవనాలపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జయదర్శిని అపార్ట్మెంట్ను నిపుణులతో పరీక్షించిన అనంతరం అవసరమైతే సీ బ్లాక్ను కూల్చివేస్తామని, అపార్ట్మెంట్ వాసులు అధికారులకు సహకరించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!