

హైడ్రా చట్టబద్ధమైన సంస్థగా చట్టప్రకారమే పనిచేస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను ఆక్రమించిన కొందరు రియల్టర్లు, కబ్జాదారులు తమ అక్రమాలను కాపాడుకునేందుకు హైడ్రాపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల విలువైన సుమారు 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని, 25 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. హైడ్రా చర్యలతో ప్రభావితమైన అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేస్తోందని, అవసరమైన చోట టీడీఆర్ రూపంలో పరిహారం అందిస్తున్నామని వెల్లడించారు. శాటిలైట్ చిత్రాలు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిజమైన బాధితులను గుర్తిస్తూ, కొత్తగా ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!