

చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్లో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో దిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలువురు దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ.. జిన్పింగ్, పుతిన్లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. బ్రిక్స్కు భారత్ సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. పశ్చిమాసియా ఘర్షణ, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత్–చైనా సంబంధాలపై జిన్పింగ్ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
జిన్పింగ్ 2019లో చివరిసారిగా భారత్కు వచ్చారు. సరిహద్దు వివాదాలు, ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో మోదీ–జిన్పింగ్ భేటీ కీలకంగా మారింది. బ్రిక్స్ సదస్సులో ప్రపంచ పాలనలో ప్రాతినిధ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు, వాణిజ్యం–పెట్టుబడులు, శాస్త్ర–సాంకేతిక సహకారం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించనున్నారు. సదస్సు నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 15 వేల మంది పోలీసులు, 200 పారామిలటరీ కంపెనీల బలగాలు, 500 సీసీటీవీ కెమెరాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!