

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ భారత టీ20 జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగో టీ20 అనంతరం సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్లను ట్యాగ్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు ఆటతీరును చూసి షాక్కు గురయ్యానని, అభిమానులకు ఇది మరో నిరాశాజనక ప్రదర్శనగా మారిందని పేర్కొన్నారు. వరుస వైఫల్యాలపై జట్టు ఆత్మపరిశీలన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. రెండున్నరేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ వ్యక్తిగతంగా బ్యాటింగ్లో ఆకట్టుకున్నప్పటికీ, కెప్టెన్గా విజయాన్ని అందుకోలేకపోయాడు. అతని నాయకత్వంలో భారత్ ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు ఓడిపోగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది. ఈ పరిస్థితుల్లో జట్టు ఎంపిక, వ్యూహాలు, నాయకత్వంపై చర్చ మరింత వేగం పుంజుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!