

మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ముంబై–పుణే ఎక్స్ప్రెస్వే 'మిస్సింగ్ లింక్' ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. ఈ ప్రాజెక్టులో వంతెనలు, సొరంగాల నిర్మాణంలో లోపాల కారణంగా రూ.7,000 కోట్లు వృథా అయ్యాయని ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని ఆయన అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం తనను మాత్రమే కాదు, మహారాష్ట్ర రాష్ట్ర గౌరవాన్ని అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు.
ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. మిస్సింగ్ లింక్ ప్రాజెక్టును విమర్శిస్తున్న వారు రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్ నాణ్యతను అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ నిపుణులు వస్తున్నప్పటికీ, దేశీయ రాజకీయ ప్రత్యర్థులు దీని ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి మౌలిక వసతుల ప్రాజెక్టులను అపఖ్యాతిపాలు చేయడం రాష్ట్ర పురోగతిని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!