
జనరల్

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలపై విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఏబీపీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామానికి సర్పంచ్గా సేవ చేయడమే తన నిజమైన లక్ష్యమని చెప్పారు.
అమెరికాలో ఉన్నత విద్యను పదవుల కోసం చదవలేదని, తన గ్రామంలోని పాఠశాలలు, రోడ్లు, డ్రైనేజీ, ఆసుపత్రి వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నానని తెలిపారు. సీజేపీ రాజకీయ పార్టీ కాదని, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే రాజకీయ ఒత్తిడి గ్రూప్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. నీట్ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆగస్టు 5న కీలక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!