
జనరల్

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు వచ్చిన నివేదికలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖకు అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం. జూలైలో జరగనున్న కార్యక్రమాలకు ప్రపంచ దేశాల నేతలను ఆహ్వానిస్తున్న క్రమంలో భారత ప్రధానికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందించినట్లు పేర్కొంటున్నారు.
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తరఫున చైనా, రష్యా, ఖతార్, ఫ్రాన్స్, పాకిస్తాన్ తదితర దేశాల నాయకులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. అయితే ఈ కార్యక్రమానికి భారతదేశం తరపున ఎవరు హాజరవుతారనే విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు. భారత్-ఇరాన్ సంబంధాలు చారిత్రకంగా కీలకమైనవిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆహ్వానం దౌత్యపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!