
జనరల్

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత స్పందించారు. విద్యార్థుల ఆందోళనల కారణంగానే ఈ రాజీనామా జరిగిందని పేర్కొన్న ఆమె, కేవలం మంత్రి రాజీనామాతో సమస్యకు పరిష్కారం లభించదన్నారు. ఇది బీజేపీ డ్యామేజ్ కంట్రోల్ చర్య మాత్రమేనని వ్యాఖ్యానించారు.
భవిష్యత్లో పేపర్ లీకేజీలు జరగకుండా వ్యవస్థాగత సంస్కరణలు తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. యూపీఎస్సీ తరహాలో ఎన్టీఏకు చట్టబద్ధమైన స్వతంత్రత కల్పించాలని, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. అలాగే నీట్ వ్యవహారంతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొన్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!