
షోస్

అయోధ్య రామమందిరం విరాళాలకు సంబంధించిన ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు క్లీన్చిట్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలపైనా దర్యాప్తు బృందం ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని, ఆయనకు కూడా క్లీన్చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో సిట్ తన తుది నివేదికను ఉత్తరప్రదేశ్ హోంశాఖకు సమర్పించినట్లు సమాచారం. విరాళాల వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో కీలక వ్యక్తులకు క్లీన్చిట్ లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సిట్ తుది నివేదికలోని పూర్తి వివరాలు, దర్యాప్తు బృందం పేర్కొన్న కారణాలు అధికారికంగా వెల్లడైన తర్వాతే ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!