
జనరల్

తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావుతో కలిసి గురువారం లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకలపై చర్చించారు.
సికింద్రాబాద్లో జరగనున్న ఆషాఢ జాతర (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గవర్నర్ను మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేశారు. లష్కర్ బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే అత్యంత వైభవమైన పండుగలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!