

కెనడాలో దోపిడీ, వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన నలుగురు పంజాబ్ మూలాల యువకులను అధికారులు దేశం నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ వెల్లడించింది. తాజాగా బహిష్కరణకు గురైన వారిని పాల్విందర్ సింగ్, జస్మేర్ సింగ్, అమితోజ్ బజ్వా, సాహిబ్జోత్ సింగ్గా గుర్తించారు. వీరికి ఎక్స్టార్షన్కు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కెనడాలో ఉంటూ ఎక్స్టార్షన్, వ్యవస్థీకృత నేరాలు వంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించిన విదేశీయులపై చర్యలు తీసుకుంటున్నట్లు సీబీఎస్ఏ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఎక్స్టార్షన్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న 111 మందిని కెనడా నుంచి బహిష్కరించినట్లు వెల్లడించింది.
ఇతర ప్రభుత్వ సంస్థలు, పోలీసు విభాగాలు అందించే సమాచారం, సీబీఎస్ఏ స్వయంగా నిర్వహించే దర్యాప్తులు, ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కేసులను పరిశీలిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. కెనడాలో వలస నిబంధనలకు అనుగుణంగా లేని వ్యక్తులను కూడా భారీగా దేశం నుంచి బహిష్కరిస్తోంది. ప్రతి వారం సుమారు 400 మంది అర్హత లేని లేదా దేశంలో కొనసాగేందుకు అనుమతి లేని వ్యక్తులను తొలగిస్తున్నట్లు సీబీఎస్ఏ పేర్కొంది. గత ఏడాది కెనడా మొత్తం 23,160 మంది అనుమతిలేని వ్యక్తులను దేశం నుంచి తొలగించగా, వారిలో 1,010 మంది తీవ్రమైన నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, జాతీయ భద్రత లేదా మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కారణాలతో అనర్హులుగా తేలినట్లు తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!