
టెక్నాలజీ

ఎప్పుడూ నీలిరంగులో కనిపించే కృష్ణా నది ప్రస్తుతం గోధుమ వర్ణంలో కనిపిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి కారణం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదిలోకి చేరి కలవడమే. దీంతో కృష్ణమ్మ నీటి రంగు పూర్తిగా మారిపోయి గోదావరి వర్ణాన్ని తలపిస్తోంది. ఈ అరుదైన దృశ్యం స్థానికులతో పాటు పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం ప్రాంతం నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణా నది ప్రవాహం గోధుమ వర్ణంలో కనిపిస్తోంది. ఈ మారిన రంగును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు నదీతీరాలకు చేరుకుని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కృష్ణా–గోదావరి జలాల సంగమం అందమైన ప్రకృతి దృశ్యంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!