
క్రీడలు

దక్షిణ కొరియాలోని సియోల్లో భారత రాయబారి గౌరంగ్లాల్ దాస్ను మంత్రి నారా లోకేశ్ కలిశారు. ఆంధ్రప్రదేశ్లో కొరియా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా సహకరించాలని కోరారు. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0, ఇండియా సెమీకండక్టర్ మిషన్తో పాటు శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో సిద్ధంగా ఉన్న పారిశ్రామిక క్లస్టర్లను ఆయన వివరించారు.
రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డులు, బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా కొరియా సహకారం కోరారు. ఏపీ-కొరియా ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి పారిశ్రామిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు. జూలై 10న జరగనున్న సియోల్ ఇన్వెస్టర్ రోడ్షోకు కొరియా కంపెనీలను ఆకర్షించేలా సహకరించాలని భారత రాయబారిని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!