
జనరల్

ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రైవేట్ విద్యుత్ బస్సుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీకే అప్పగించాలని డిమాండ్ చేసింది. అలాగే స్త్రీశక్తి బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు, చాలా కాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరింది.
సోమవారం ఆర్టీసీ యాజమాన్యంతో జరగనున్న చర్చల నేపథ్యంలో విజయవాడలో జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. వివిధ జిల్లాల జేఏసీ ప్రతినిధులు ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని డిమాండ్లపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సేవల మెరుగుదల, ఉద్యోగుల సంక్షేమం, సంస్థ బలోపేతం కోసం 30కిపైగా డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచనున్నట్లు జేఏసీ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!