

మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) డ్రగ్స్ మాఫియాపై కీలక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో మొత్తం రూ.9.4 కోట్ల విలువైన మెథాంఫెటమైన్తో పాటు డ్రగ్ తయారీకి ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ముంబైలోని బాంద్రా ఈస్ట్లో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ATS అధికారులు, అతని నుంచి సుమారు రూ.4 కోట్ల విలువైన మెథాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గ్రేటర్ నోయిడాలో డ్రగ్ తయారీ కేంద్రం ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
దీంతో యూపీ పోలీసులతో కలిసి గ్రేటర్ నోయిడాలో ATS అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో మరో 2.68 కిలోల మెథాంఫెటమైన్ లభించింది. దీని విలువ సుమారు రూ.5.40 కోట్లుగా అంచనా వేశారు. డ్రగ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, పరికరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ATS, యూపీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!