

లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించారు. శుభాంకర్ మిశ్రా పోడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. వైభవ్ అరుదైన ప్రతిభ కలిగిన ఆటగాడని, అతడిని జట్టులోకి తీసుకోలేకపోయినందుకు ఇతర ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులు కూడా బాధపడుతున్నారని పేర్కొన్నారు. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్ను రూ.1.10 కోట్లకు దక్కించుకుంది.
వైభవ్లో అద్భుతమైన ప్రతిభతో పాటు చక్కటి క్రికెట్ షాట్లు, అత్యుత్తమ ఆత్మవిశ్వాసం ఉన్నాయని గోయెంకా అన్నారు. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అతడు అతివిశ్వాసానికి లోనుకాకపోవడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. రాజస్థాన్ రాయల్స్కు లక్ష్మీ మిత్తల్ ప్రధాన యజమానిగా ఉన్న నేపథ్యంలో వైభవ్ను ఫ్రాంచైజీ వదులుకునే అవకాశం లేదని గోయెంకా అభిప్రాయపడ్డారు. ఒకవేళ అతడు ఎప్పుడైనా అందుబాటులోకి వస్తే ఇతర ఫ్రాంచైజీలు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!