
రాజకీయాలు

జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగ పీఠికతో పాటు ‘సెక్యులర్’, ‘సెక్యులరిజం’ వంటి పదాలను తొలగించింది. జాతీయ విద్యా విధానం ఆధారంగా సవరించిన ఈ పుస్తకంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పాఠ్యాంశంగా చేర్చింది. లక్షలాది మంది యువ ఓటర్లు ఎన్నికల జాబితాలో చేరినట్లు పేర్కొంది. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రశంసించింది.
వేద నాగరికతలో మహిళలకు ఉన్న ఉన్నత స్థానం గురించి, అలాగే మనుస్మృతిలో సామాజిక వ్యవస్థ, పాలనకు సంబంధించిన అంశాలను కూడా చేర్చింది. గతంలో విమర్శలు ఎదుర్కొన్న న్యాయవ్యవస్థ అంశాన్ని సవరించి, దానిని స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థగా అభివర్ణించింది. ఈ మార్పులు విద్యా, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీయవచ్చు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!