
జనరల్

వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2026 షెడ్యూల్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. పరీక్షను ఆగస్టు 30, 2026న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై, ఈ నెల 21 వరకు కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థులకు పరీక్ష నగర వివరాలను ఆగస్టు 11, 2026న తెలియజేయనుండగా, సెప్టెంబర్ 30, 2026న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నిర్ణీత గడువులోపు దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!