

రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ట్యాంక్బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.
గౌడ కార్మికులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు. గీత కార్మికుల వృత్తికి అవసరమైన ఈత, తాటి చెట్లను నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై నాటేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించారు.
పిల్లలను తప్పనిసరిగా చదివించాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం ఇస్తున్నామని చెప్పారు. బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ వంటి చర్యలతో తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!