
జనరల్

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా యువత ఉద్యోగాలు పొందారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తొలిసారి ఉద్యోగాలు పొందినవారికి, వారి యజమానులకు కలిపి రూ.2,400 కోట్ల ప్రోత్సాహకాలను ఆయన విడుదల చేశారు.
ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగ అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయని మోదీ అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు సామాజిక భద్రత కలుగుతోందని తెలిపారు. యువత నైపుణ్యాలు, ఆకాంక్షలు దేశ అభివృద్ధికి దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!