
బిజినెస్

బెంగళూరులో తన ఓటు తొలగించడంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బెంగళూరులోనే పుట్టానని, గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశానని పేర్కొంటూ.. అలాంటప్పుడు తన ఓటును ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మళ్లీ ఓటరు కార్డు పొందేందుకు ఎలాంటి పత్రాలు అవసరమో ఎన్నికల సంఘాన్ని ప్రకాష్ రాజ్ అడిగారు. ఓటు తొలగింపు ప్రక్రియలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!