
బిజినెస్

జార్ఖండ్లో కొనసాగుతున్న బంద్ నేపథ్యంలో రాంచీ రోడ్లపై బీజేపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు రోడ్డుపై టైర్లు కాల్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కు నిరసనగా ఈ ఆందోళనలు చేపట్టినట్లు బీజేపీ తెలిపింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేసింది. నిరసనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కీలక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!