

జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో ప్రత్యేక పెట్టుబడి ప్రోత్సాహక సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ఏజెన్సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సంస్థలో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు ప్రత్యేక డైరెక్టర్లను కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది.
పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, ప్రభుత్వ శాఖల సమన్వయం, మార్గదర్శక సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. విదేశీ కంపెనీల పెట్టుబడులను వేగంగా ఆకర్షించేందుకు ప్రత్యేక ఇన్వెస్ట్ సెల్, ఎస్కార్ట్ ఆఫీసర్ విధానాన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పెరుగుతున్న పెట్టుబడి పోటీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణను గ్లోబల్ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!