

విశాఖపట్నం పోర్టులో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కేంద్ర ఓడరేవుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టు అంతర్గత ప్రాంతంలో రూ.334 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు ఆమోదం లభించింది. కాన్వెంట్ జంక్షన్ను డాక్ ఏరియాతో అనుసంధానించేలా 3.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి అంగీకారం తెలిపారు.
పోర్టు లోపల రోడ్డు, రైలు రవాణాను వేరు చేయడం ద్వారా సరుకు రవాణాను వేగవంతం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తొమ్మిది రైల్వే క్రాసింగ్ల వద్ద తరచూ ఏర్పడుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఫ్లైఓవర్ కీలకంగా ఉపయోగపడనుంది. విశాఖపట్నంలో రవాణాకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్గత ఫ్లైఓవర్ను 30 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఓడరేవుల శాఖ తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!