
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారికంగా జీవో జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్గా పనిచేస్తున్న కె. రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయిన సంజయ్ జాజు త్వరలోనే కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. పరిపాలనా అనుభవం కలిగిన ఆయన నియామకంతో ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన చీఫ్ సెక్రటరీ పదవిలో ఆయన సేవలు అందించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!