
క్రీడలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి, విశ్వాసం, ప్రజా సంక్షేమానికి అంకితమైన 12 ఏళ్ల పాలన పూర్తి సందర్భంగా నిర్వహిస్తున్న విశేష జనసంపర్క్ అభియాన్లో భాగంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్చందర్రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రముఖ సినీ నటుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసింది.
ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ గత 12 ఏళ్ల ముఖ్య విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, కీలక సంస్కరణలను వివరించే పుస్తకాన్ని రామ్చందర్రావు చిరంజీవికి అందజేశారు. సమాజం, సంస్కృతి, సినిమా రంగం, దేశ నిర్మాణం వంటి అంశాలపై చర్చలు జరిపిన ప్రతినిధి బృందం అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వ కట్టుబాటును వివరించింది. ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!