

తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, ఐఏఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 24న రాష్ట్రంలోని ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదనపు ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.ఎస్. చారి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల DEOలు, EROలు, AEROలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ స్టేషన్ల పరిధిలో గ్రామ, వార్డు సభల నిర్వహణతో పాటు ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై సీఈఓ సమీక్షించారు.
గ్రామ, వార్డు సభల్లో Absent, Shifted, Dead, Duplicate (ASDD) ఓటర్ల వివరాలను సంబంధిత BLOలు బహిరంగంగా చదివి వినిపించాలని, ముసాయిదా ఓటర్ల జాబితాలో కొత్తగా చేర్చిన పేర్లను కూడా సభల్లో వెల్లడించాలని సీఈఓ సూచించారు. ముసాయిదా జాబితాలో పేర్లు చేరని దరఖాస్తులను గుర్తించి పరిశీలించాలని ఆదేశించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసే అర్హత కలిగిన పౌరులు Form-6 ద్వారా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, పేర్ల తొలగింపులకు Form-7, సవరణలకు Form-8 వినియోగంపై ప్రజలకు వివరించాలని సూచించారు. Anomalies, No-Mapping కేసులకు నోటీసులు, హియరింగ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి నోటీసులో వేదిక, తేదీ, సమయం స్పష్టంగా పేర్కొనాలని ఆదేశించారు. సంబంధిత జాబితాలను రాజకీయ పార్టీలకు BLOలు అందించాలని, రాజకీయ పార్టీలతో సమన్వయం కోసం వారానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గ్రామ, వార్డు సభలను పారదర్శకంగా నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచాలని సీఈఓ పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!