
రాజకీయాలు

మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. హిమాయత్సాగర్ పరిధిలోని తమ భూములను ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక) లేకుండా భూసేకరణ ఎలా చేపడతారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కె. వివేక్ రెడ్డి, కె. ప్రతీక్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు విన్న హైకోర్టు.. ఈ వ్యవహారంపై వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు పిటిషనర్లకు చెందిన భూములను స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో మూసీ రివర్ఫ్రంట్ ప్రాజెక్ట్లో భాగంగా హిమాయత్సాగర్ భూముల సేకరణపై ప్రస్తుతం న్యాయపరమైన ఆంక్షలు కొనసాగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!