
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్లో కొత్త టీపీసీసీ చీఫ్ నియామకంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పదవీకాలం ఈ నెల 15తో ముగియనుండటంతో, తదుపరి అధ్యక్షుడి ఎంపికపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పార్టీ అధిష్టానం రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నాయకత్వ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కొత్త అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోటాలో మహేశ్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ సాగుతోంది. ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే, టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా మారనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!