
జనరల్

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో బీఫ్ దుకాణాల ఏర్పాటు అంశంపై రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, పదునైన ఆయుధాలతో దాడులకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, చికిత్స కోసం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కొందరిపై మరోసారి దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!