

నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. 2017లో నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఘటనలో పోలీసుల చిత్రహింసలకు గురైన గంధం గోపాల్ గత పదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం అత్యంత విషాదకరమని ఆమె అన్నారు. గోపాల్ మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని కవిత విమర్శించారు. అలాగే బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తన మాట నిలబెట్టుకోలేదన్నారు. త్వరలోనే గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!