

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ బలగాలు విజయవంతంగా అడ్డుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా, సౌదీ అరేబియా కలిసి తూర్పు ఇరాక్లో ఇరాన్ మద్దతు గల సాయుధ దళాలు ఉపయోగిస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించాయి. వెంటనే దాడులు నిలిపేయాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి.
గత 72 గంటల్లో జరిగిన 30కిపైగా డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఈ సంయుక్త దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ నుంచి వచ్చిన డ్రోన్లను వరుసగా రెండో రోజు కూడా సౌదీ అరేబియా కూల్చివేసింది. ఇదే తరహా దాడులు సోమవారం కూడా జరిగాయని ఆరోపించింది. ఈ ఘటనలపై దర్యాప్తు చేయాలని ఇరాక్ ప్రధాని అలీ అల్-జైదీ భద్రతా సంస్థలను ఆదేశించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!